News February 24, 2025
వికారాబాద్: ఆరు పాఠశాలల్లో ఏఐ విద్య: DEO

VKB జిల్లాలోని ఆరు పాఠశాలల్లో AI విద్యను అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టుగా 36 పాఠశాలల్లో అమలు చేస్తుండగా 6 పాఠశాలలు జిల్లాలో ఉన్నాయి. దోమ మండలంలోని బొంపల్లి, పరిగి మండలంలోని గడిసింగాపూర్, తాండూరులోని సాయిపూర్, కొడంగల్, కోట్పల్లి, VKB మండలంలోని పులుమద్ది పాఠశాలల్లో ఏఈ విద్యను అమలు చేయనున్నారు. ప్రతి ఒక్కరి కృషితో AI విద్యను అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు DEO తెలిపారు.
Similar News
News December 29, 2025
మార్కాపురం సరికొత్త జిల్లాలో.. మండలాలు ఇవేనా?

మార్కాపురం జిల్లాకు కొత్త ఏడాదిలో ముహూర్తం ఖరారైంది. గతంలో 21 మండలాలతో ఆమోదం తెలపగా.. దొనకొండ, కురిచేడు మండలాలను కలిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. వైపాలెం, రాచర్ల, కొమరోలు, త్రిపురాంతకం, వెలిగండ్ల, పి.చెరువు, దోర్నాల, పెద్దారవీడు, హెచ్.యం పాడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, పీసీపల్లి, సీఎస్పురం, పామూరు, కంభం, అర్ధవీడు, కంభం, బి.పేట, దొనకొండ, కురిచేడు మండలాలు ఉండనున్నాయి.
News December 29, 2025
అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె

అన్నమయ్య జిల్లా విభజన విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అన్నమయ్య జిల్లా పేరు యథావిధిగా కొనసాగుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. జిల్లా కేంద్రంగా మదనపల్లె ఉంటుందని స్పష్టం చేశారు. తప్పని పరిస్థితుల్లో రాయచోటిని మార్చాల్సి వచ్చిందని చెప్పారు. మొత్తంగా పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటితో అన్నమయ్య జిల్లా కొనసాగనుంది. ఈ మార్పులు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి.
News December 29, 2025
OFFICIAL: తిరుపతిలో R.కోడూరు.. గూడూరు ఔట్.!

తిరుపతిలో జిల్లాలో రైల్వే కోడూరు నియోజకవర్గ విలీనానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని అధికారికంగా నిర్ణయించారు. ఈ కొత్త మార్పులు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.


