News February 26, 2025
వికారాబాద్: ఇంటర్ పరీక్షలు రాయనున్న 16,439మంది స్టూడెంట్స్

మార్చ్ 5 నుంచి కొనసాగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని వికారాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు 29 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 16,439 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతారన్నారు. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం- 7,914 మంది, సెకెండ్ ఇయర్ 6,963 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు.
Similar News
News February 26, 2025
పిట్లం: రాజీ కాలేదని కన్నతల్లిని కొట్టి చంపేశాడు..!

కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన పిట్లంలో మంగళవారం జరిగింది. SI రాజు వివరాలిలా.. సాబేర బేగం(60)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. రెండో కొడుకైన శాదుల్ నాలుగేళ్ల క్రితం తన తమ్ముడైన ముజిబ్ను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రాజీపడాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో రోకలి బండతో తలపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 26, 2025
36 సార్లు ఢిల్లీకి.. 3 రూపాయలు తేలేదు: KTR

TG: 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తీసుకురాలేదని సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైరయ్యారు. SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలారని దుయ్యబట్టారు. 96 గంటలు దాటినా ముందడుగు వేయడం లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం పగుళ్లు, శ్రీశైలం అగ్నిప్రమాదంపై కారుకూతలు కూసిన మేధావులు SLBC విషయంలో మాత్రం నోరెత్తడం లేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు.
News February 26, 2025
రామప్ప శివపార్వతుల కళ్యాణానికి మంత్రి సీతక్క

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ములుగులోని రామప్పలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు అందించనున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించి, అనంతరం పలు దేవాలయాల్లో జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు హాజరుకావాలని కోరారు.