News April 8, 2025
వికారాబాద్: జిల్లాలో ఇన్కమ్ టాక్స్ దాడులు

జిల్లా పరిధిలోని ఛన్గోముల్ గ్రామంలో సోమవారం ఇన్కమ్ టాక్స్ అధికారి విట్టల్ రావు బృందం దాడులు నిర్వహించింది. గ్రామానికి చెందిన బేగారి ప్రభాకర్ ఇంటిని వరంగల్కు చెందిన పండాల రవళి అద్దెకు తీసుకొని, వ్యాపారం చేస్తున్నట్లు చూపుతూ ఫోర్జరీ సంతకాలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారులు వివరాలు సేకరించినట్లు కార్యదర్శి పరుశురాం తెలిపారు.
Similar News
News April 18, 2025
BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

AP: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. హిందూపురానికి చెందిన నాగరాజు, నాగభూషణ్, మురళి, సోమలు యాద్గిర్(KA) జిల్లా షహర్పూర్కు బొలెరోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును వీరి వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో వీరంతా అక్కడికక్కడే మృతిచెందారు.
News April 18, 2025
బంగ్లాదేశ్ నీతులు చెప్పడం మానాలి: విదేశాంగ శాఖ

భారత్కు నీతులు చెప్పడం మాని తమ దేశంలోని మైనారిటీలను కాపాడాలని బంగ్లాదేశ్కు విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పష్టంచేశారు. ఆ దేశంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులను కప్పిపుచ్చడానికి భారత్ను బంగ్లాదేశ్ విమర్శిస్తోందని ఆరోపించారు. కాగా బెంగాల్లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ముగ్గురు మరణించారు. దీంతో భారత్లోని మైనారిటీ ముస్లింలను కాపాడాలని బంగ్లాదేశ్ వ్యాఖ్యానించింది.
News April 18, 2025
NZB: చరిత్ర ఆధారాలను గుర్తు చేస్తున్న క్లాక్ టవర్.. Way2News స్పెషల్..

NZBలో దశాబ్దాల క్రితం నిర్మించిన క్లాక్ టవర్ చారిత్రాత్మక ఆధారాలను గుర్తు తెస్తుంది. 1905లో సిర్నాపల్లి సంస్ధాన్ పాలకురాలు శీలం జానకీ బాయి క్లాక్ టవర్తో పాటు రెండు స్వాగత తోరణాలను నిర్మించేందుకు ఐదు ఎకరాలను విరాళంగా ఇచ్చారు. స్వాతంత్య్రానికి ముందు NZB మార్కెట్ యార్డును ‘మహబూబ్ గంజ్’ అని పిలిచేవారు. ఆ తర్వాత దానిని ‘గాంధీ గంజ్’గా మార్చారు. క్లాక్ టవర్లోని అలారం ఆధారంగా ఇక్కడ వ్యాపారాలు జరిగేవి.