News March 20, 2025

వికారాబాద్: పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు

image

వికారాబాద్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 2వ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 12,903మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,450 మంది బాలురు, 6,453 మంది బాలికలు ఉన్నారు. 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

Similar News

News March 21, 2025

HYD: TG ఖోఖో జట్టు.. మనోళ్లు వీళ్లే !!

image

దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు ఢిల్లీకి చేరుకుంది. తెలంగాణ ఖోఖో జట్టుకు కే.స్వాతి ప్రియాంక (PD,గోల్కొండ-HYD), కే.లీల (PD, బోయిన్ పల్లి-HYD), కే.కవిత (PD,పుట్ట పడ్-VKB) ఎంపికయ్యారు. దీంతో వీరిని ఎమ్మెల్యేలు, నేతలు, ఆయా పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అభినందించారు.

News March 21, 2025

చాహల్-ధనశ్రీ విడాకులు.. అప్పటి నుంచే దూరం!

image

చాహల్ – ధనశ్రీ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేయగా, రూ.4.75కోట్ల భరణం చెల్లించేందుకు చాహల్ అంగీకరించారు. కాగా 2020 డిసెంబర్‌లో వీరికి పెళ్లవగా, ఏడాదిన్నరకే (2022 జూన్) సపరేట్ అయినట్లు విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ధనశ్రీ ఫేమ్ కోసం చాహల్‌ను వాడుకున్నారని కొందరు అంటుండగా, ఆమె ఎలాంటి తప్పు చేయలేదని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.

News March 21, 2025

 వికారాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

ఓ యువకుడు ఉద్యోగం సాధించి మొదటి రోజు విధులకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ధారూర్ మండలం కేరేల్లి గ్రామానికి చెందిన నవీన్(26) నిన్న ఉద్యోగానికి వెళ్లి వస్తుండగా కోకపేట టీగ్రీల్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై నర్సింగ్ పోలీసుకు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!