News March 1, 2025
వికారాబాద్లో పోలీస్ను ఢీకొట్టిన బైకర్ (PHOTO)

తనిఖీల్లో పోలీస్నే ఢీకొట్టాడు ఓ బైకర్. వికారాబాద్ నుంచి దన్నారం రూట్లోని కట్టెల మిషన్ వద్ద రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ బైకర్ పోలీసుల మీదకు దూసుకొచ్చాడు. తాగి దొరికిపోతానని గ్రహించిన బైకర్ ఇలా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన హోంగార్డు కృష్ణను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హోంగార్డు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News March 1, 2025
ఇతని ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి: పార్వతీపురం కలెక్టర్

పార్వతీపురం(D)కు చెందిన అప్పారావు 20ఏళ్ల క్రితం పాండిచ్చేరి వెళ్తూ టీ తాగుదామని రైల్వే స్టేషన్లో దిగగా రైలు వెళ్లిపోయింది. అప్పటి నుంచి TNలోని కలైయార్కోయిల్లో అన్నాదురై అనే వ్యక్తి వద్ద వెట్టిచాకిరి చేస్తున్నాడు. ఇటీవల లేబర్ ఆఫీసర్లు ఈయనను గుర్తించారు. అప్పారావు తన కుటుంబ వివరాలు చెప్పలేకపోతున్నాడు. దీంతో అతని గురించి తెలిసిన వారు 8333813243 నంబరుకు తెలియజేయాలని పార్వతీపురం కలెక్టర్ కోరారు.
News March 1, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 479 మంది విద్యార్థులు గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. జనరల్ విద్యార్థులలో 11,843 మంది విద్యార్థులకు గానూ 11,460 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులలో 1,580 మంది విద్యార్థులకు గానూ 1,484 మంది హాజరయ్యారన్నారు. 479 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు.
News March 1, 2025
ఎస్.కోట: తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య

ఎస్.కోటకి చెందిన వ్యక్తి తల్లి చనిపోయిందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. CI నారాయణమూర్తి వివరాల ప్రకారం.. మండలంలోని అయితన్నపేటకి చెందిన సంతోశ్ కుమార్(35) తల్లి మూడేళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి మనస్తాపానికి గురైన సంతోశ్ ఫిబ్రవరి 25న మందులో పురుగుమందు కలుపుకొని తాగాడు. దీంతో అతడిని ఎస్.కోట ఆస్పత్రికి తరలించాడు. అక్కడి నుంచి విజయనగరం తరలించగా చికిత్స పొందతూ శుక్రవారం మృతిచెందాడు.