News May 29, 2024
విజయనగరం: కన్నపేగుకు కడుపుకోత

పిల్లల సరదాలు కన్నపేగుకు కడుపుకోతను మిగిలుస్తున్నాయి. బొబ్బిలి మండలంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోనంగి సాయి ఏకైక సంతానం కావడంతో అతని తల్లిదండ్రుల ఆర్తనాదాలకు అవధులు లేవు. అటు జామి ఘటనలో మరణించిన షాకిద్ ఖాన్ తల్లిదండ్రులు రోజువారీ కూలీ చేసుకుంటూ చదిస్తున్నారు. ముగ్గురు కుమార్తెల తర్వాత పుట్టిన ఏకైక మగ సంతానం మహమ్మద్ అస్రాఫ్ మరణవార్త విన్న అతని అమ్మానాన్న శోక సంద్రంలో మునిగిపోయారు.
Similar News
News April 23, 2025
10th RESULTS: ఏడో స్థానంలో విజయనగరం జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 22,777 మంది పరీక్ష రాయగా 19,824 మంది పాసయ్యారు. 11,413 మంది బాలురులో 9.748(85.41%) మంది, 11,364 మంది బాలికలు పరీక్ష రాయగా 10,076(88.67%) మంది పాసయ్యారు. 87.04% పాస్ పర్సంటైల్తో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ఏడో స్థానంలో నిలిచింది.
News April 23, 2025
VZM: ఆ పాఠశాల ఫలితాల కోసం ఎదురుచూపు

బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు బాగా చదవడం లేదని పరీక్షలకు నెల రోజుల ముందు హెచ్ఎం రమణ విద్యార్థుల ముందు గుంజీలు తీసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తామని, ట్రిపుల్ ఐటి సీట్లు సాధిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 85 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News April 23, 2025
VZM: భార్గవ్, భార్గవ ఇద్దరూ ఇద్దరే..!

యూపీఎస్సీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సివిల్స్కు విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఎంపికైన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన పొటుపురెడ్డి భార్గవ్(455వ ర్యాంక్) కాగా మరొకరు రాజాం మండలం సారధి గ్రామానికి చెందిన వావిలపల్లి భార్గవ్(830వ ర్యాంక్) ఉన్నారు. భార్గవ్ ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణలో ఉండగా, భార్గవ స్టేట్ టాక్స్ అధికారిగా ఉన్నారు.