News March 20, 2025

విజయనగరం జిల్లా వాసులకు అలెర్ట్

image

విజయనగరం జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. 15 మండలాల్లో సుమారు 40 °C టెంపరేచర్‌ నమోదు కానుండగా.. 20 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. వంగరలో 40.6°C, తెర్లాంలో 40.5°C, రామభద్రపుర, రేగిడి ఆమదాల వలసలో 40.2, మెరకముడిదాంలో 40, గజపతినగరం, రాజాంలో 39.9, గంట్యాడలో 39.7, సంతకవిటిలో 39.6, గరవిడిలో 39.5, గుర్లలో 39.3, విజయనగరంలో 38.5°C గా నమోదవుతాయి.

Similar News

News March 21, 2025

VZM: ఇళ్ల లబ్దిదారులకు ఉచితంగా ఇసుక: కలెక్టర్

image

ఇళ్ల లబ్దిదారులకు ప్ర‌భుత్వం అందిస్తున్న అద‌న‌పు సాయాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కలెక్ట‌ర్ అంబేడ్కర్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు. అద‌నంగా ఆర్ధిక సాయం చేయ‌డ‌మే కాకుండా, ఇసుక‌ను కూడా ప్ర‌భుత్వ‌మే ఉచితంగా ఇస్తోందన్నారు. ల‌బ్దిదారులు వీటిని వినియోగించుకొని స‌కాలంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాల‌న్నారు. ప్ర‌స్తుతం ఇళ్ల నిర్మాణానికి అనుకూల‌మైన స‌మ‌య‌మ‌ని చెప్పారు.

News March 20, 2025

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో బేబినాయన భేటీ

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన గురువారం భేటీ అయ్యారు. అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించారు. బాడంగి మండలం గొల్లాదిలో వేగవతి నదిపై వంతెన ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పామని వంతెన నిర్మాణానికి సహకరించాలని కోరారు. వంతెన నిర్మాణం పూర్తయితే నిర్మాణం వలన బాడంగి, రాజాం, దత్తిరాజేరు, మెరకముడిదాం గ్రామాల ప్రజలకు  ఉపయోగపడుతుందన్నారు.

News March 20, 2025

VZM: నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి: SP

image

సైబరు నేరాలను చేధించేందుకు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లగా పని చేస్తున్న కానిస్టేబుళ్లకు బుధవారం అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో సైబరు నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నేరాలను నియంత్రించుట, నమోదైన కేసుల్లో దర్యాప్తు చేపట్టుటకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతీ పోలీసు అధికారి మెరుగుపర్చుకోవాలన్నారు.

error: Content is protected !!