News April 12, 2024

విజయనగరం జిల్లాలో పరీక్ష రాసిన 45,755 మంది

image

ఈరోజు 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో విజయనగరం జిల్లాకు చెందిన 45,755 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 45,755 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 20,630 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు 25,125 మంది ఉన్నారు.

Similar News

News September 30, 2024

VZM: యువతకు ఎస్పీ కీలక సూచనలు

image

ప్రస్తుతం గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతూ, చట్టాలను కూడా కఠినతరం చేశామన్న విషయాన్ని యువత గమనించాలని విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గంజాయి అక్రమ రవాణా కేసులో పట్టుబడితే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడుతుందన్నారు. గంజాయి కేసుల్లో ఎక్కువగా యువత పట్టుబడుతూ.. జైల్లో మగ్గుతున్నారని ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు.

News September 30, 2024

విజయనగరం: TODAY TOP NEWS

image

⁍VZM: దసరా సెలవులు ఆరు రోజులే
⁍పార్వతీపురం దిశ సెల్ ఎస్ఐలు వీరే
⁍బొబ్బిలిలో కొండచిలువ హతం
⁍విజయనగరం జిల్లాలో ఎక్సైజ్ సీఐలకు బదిలీలు
⁍విజయనగరం జిల్లాలో టెట్ పరీక్షా కేంద్రాలివే
⁍పైడితల్లమ్మ సిరిమాను చెట్టుకు పూజలు
⁍రేపు బొబ్బిలి రానున్న సినీ నటుడు సాయికుమార్
⁍కురుపాంలో యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్‌డెడ్
⁍నిండుకుండలా తాటిపూడి జలాశయం
⁍రామతీర్థంలో రామచంద్ర ప్రభువుకు పట్టు పవిత్రాల సమర్పణ

News September 29, 2024

కురుపాంలో యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

కురుపాం మండలం వలసబల్లేరు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని నీలకంఠపురం SI తెలిపారు. ఘటనలో బిడ్డిక జూజారు, బిడ్డిక శ్రీను మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.