News February 25, 2025
విజయనగరం: బొత్సపై స్పీకర్ అయ్యన్న మండిపాటు

శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో స్పీకర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు సభలో YCP ప్రవర్తన పై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతల తీరును జగన్ నియంత్రించాల్సింది పోయి కూర్చొని నవ్వుకుంటారా? అని ప్రశ్నించారు. బొత్స వంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా చేసేది తప్పని చెప్పలేదని ఫైర్ అయ్యారు.
Similar News
News February 25, 2025
విజయనగరం జిల్లాకు అరుదైన గుర్తింపు

జాతీయ భౌగోళిక పాలసీలో పైలట్ జిల్లాగా విజయనగరంను ఎంపిక చేయడం వలన స్థానికంగా ఉన్న అనేక అంశాలకు చక్కటి పరిష్కారం లభిస్తుందని JC సేతు మాధవన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం వర్క్ షాప్ నిర్వహించారు. దేశంలోని 5 రాష్ట్రాలలో 5 జిల్లాలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేయగా అందులో విజయనగరం ఒకటన్నారు. వివిధ శాఖల్లో పలు అంశాలకు సంబంధించి వచ్చే రెండు, మూడు నెలల్లో మంచి ఫలితాలను చూడబోతున్నామన్నారు.
News February 25, 2025
చికెన్, గుడ్లు నిర్భయంగా తినొచ్చు: VZM కలెక్టర్

ప్రజలు చికెన్, కోడిగుడ్లను నిర్భయంగా తినొచ్చని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. బర్డ్ఫ్లూ వ్యాధి, చికెన్, కోడిగుడ్ల వినియోగంపై తమ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బర్డ్ఫ్లూ వ్యాధి గానీ, ఆ లక్షణాలు గల వ్యాధిగ్రస్తులు గానీ లేరని పశు వైద్యాధికారులు దృవీకరించారని చెప్పారు.
News February 24, 2025
రామతీర్థంలో శివరాత్రికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26 నుంచి జరిగే శివరాత్రి జాతర ఉత్సవాలకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సీఐ రామకృష్ణ, ఎస్ఐ గణేశ్తో కలిసి రామతీర్థంలో ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. క్యూలైన్లు, వాహనాల పార్కింగ్, ప్రసాదం కౌంటర్లు తదితర ఏర్పాట్లను పరిశీలించి, సూచనలు చేశారు. ఏర్పాట్లపై ఆలయ ఈఓ శ్రీనివాసరావుతో చర్చించారు.