News September 28, 2024
విజయనగరం: మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాలు
మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జిల్లాలో నమోదు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 23 మందికి రూ.1.20 లక్షల జరిమానాను కోర్టు విధించిందని చెప్పారు. వీరిలో ఏడుగురికి రూ.10వేలు చొప్పున జరిమానా విధించారని చెప్పారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News October 10, 2024
రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు: మంత్రి
రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, దేశానికి తీరని లోటు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన మృతి పట్ల గురువారం మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్ప మానవతావాది కోల్పోయిందని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజమని కొనియాడారు. పుట్టు కోటీశ్వరుడైనా, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగినా, సామాన్య జీవనం సాగించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని పేర్కొన్నారు.
News October 10, 2024
పైడితల్లి జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
విజయనగర ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో మధుర స్మృతిగా నిలిచిపోయేలా నిర్వహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఏర్పాట్లను చూసి అధికారులతో మాట్లాడిన తర్వాత ఉత్సవాలు ఘన విజయం అవుతాయనే నమ్మకం కలిగిందని అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి బుధవారం సమీక్షించారు. ఉత్సవాలు విజయవంతం చేయాలని సూచించారు.
News October 9, 2024
మోసపోయిన విజయనగరం యువతి
విజయనగరానికి చెందిన యువతిని ఇద్దరు మోసగించారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తామనే మాటలు చెప్పి ఆమె నుంచి రూ.9లక్షలు వసూలు చేశారు. ఈ క్రమంలో వారిని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు పట్టుకున్నారు. ఆరా తీస్తే, ఈ నిందితులు పలువురికి ఇలాగే మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. యువత ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.