News February 19, 2025
విజయనగరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్గా కె.అప్పలరాజు

విజయనగరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్గా కె.అప్పలరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ అప్పలరాజు మాట్లాడుతూ.. కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో, తోటి సిబ్బంది సమన్వయంతో నగరాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా ఆదాయ రాబడిపై దృష్టి సారిస్తానని, పన్ను వసూళ్లు లక్ష్యాలను అధిగమించే దిశగా పని చేస్తానన్నారు.
Similar News
News February 22, 2025
విజయనగరం: 10వ తరగతి విద్యార్థి మృతి

విజయనగరం జిల్లాలో విషాద ఘటన జరిగింది. డెంకాడ మండలం పినతాడివాడకు చెందిన గంగరాజు కుమారుడు రాజు(17) మెర్సి మిషన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పెదతాడివాడలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన శుభకార్యానికి అతను వెళ్లాడు. తిరిగి బైకుపై ఇంటికి వస్తుండగా పెదతాడివాడ, పినతాడివాడ గ్రామాల మధ్య ట్రాక్టర్ ట్యాంకర్ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో అతను చనిపోయాడు.
News February 22, 2025
విజయనగరం వైసీపీ ప్రచార కార్యదర్శిగా బొద్దల

వైసీపీ విజయనగరం జిల్లా ప్రచార కార్యదర్శిగా బొద్దల సత్యనారాయణను నియమిస్తూ అధిష్టానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు సత్యనారాయణ కృతజ్ఞతలు చెప్పారు. బొబ్బిలి మండలం ముత్తావలస గ్రామానికి చెందిన సత్యనారాయణ సర్పంచిగా పని చేశారు. వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
News February 22, 2025
గరివిడి: గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధ్యాయుడు

గరివిడి మండలంలోని కొండదాడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రామారావు(50) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పాఠశాలలో ప్రార్థన ముగిసిన తరువాత అసౌకర్యంగా ఉండడంతో రామారావు బాత్ రూమ్ కు వెళ్లారు. ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.