News June 6, 2024

విజయనగరం: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

image

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్. బూర్జివలస ఎస్. ఐ లక్ష్మీ ప్రసన్నకుమార్ గురువారం తెలిపారు. పి.లింగాలవలస గ్రామానికి చెందిన పరిగి సుబ్బారావు (45) స్వగ్రామం వస్తుండగా జగన్నాథపురం సమీపంలో ఆటో ఢీకొట్టి మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా వెంకన్నపాలెం గ్రామానికి చెందిన గొంతినె శ్రీనివాసరావు బైక్‌పై వస్తుండగా మరడాం జంక్షన్ వద్ద బొలెరో వాహనం ఢీకొనడంతో మృతి చెందారు.

Similar News

News September 29, 2024

ఏయూ: ‘అక్టోబర్ 7 నుంచి దసరా సెలవులు’

image

ఏయూతో పాటు అనుబంధ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఈ.ఎన్ ధనుంజయ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 7 (సోమవారం) నుంచి 12(శనివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 14(సోమవారం) తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

News September 29, 2024

విజయనగరం: ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

image

పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన లంకలపల్లి దుర్గారావు(39) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఎన్.ఏం.ఆర్‌గా పనిచేస్తున్న దుర్గారావు మానసిన సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 29, 2024

సౌర విద్యుత్‌పై అవగాహన కల్పించాలి: VZM జేసీ

image

ప్ర‌తీ ఇంట్లో సౌర విద్యుత్ వినియోగించుకొనే విధంగా వినియోగ‌దారుల‌ను చైత‌న్య‌ప‌ర‌చాల‌ని జేసీ ఎస్‌.సేతుమాధ‌వ‌న్ కోరారు. దీనికోసం కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పీఎం సూర్య‌ఘ‌ర్ యోజ‌న ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ ప‌థ‌కం అమ‌లుపై శ‌నివారం సంబంధిత శాఖ‌ల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. మండ‌లాల వారీగా ప‌థ‌కం అమ‌లును స‌మీక్షించారు.