News August 2, 2024

విజయనగరంలో బియ్యం, కందిపప్పు ధరల తగ్గింపు

image

జిల్లాలోని వివిధ రైతు బజార్లు, పీడబ్ల్యుడీ మార్కెట్, డి-మార్ట్, రిలయన్స్, స్పెన్సర్, మోర్ తదితర మార్కెట్లలో శుక్రవారం నుంచి తగ్గింపు ధరకు కందిపప్పు, బియ్యం విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు జేసీ కే.కార్తీక్ తెలిపారు. దేశవాళీ కందిపప్పు కిలో రూ.155 నుంచి రూ.150కి, బియ్యం (స్టీమ్) బిపిటి, సోనామసూరి కిలో రూ.49 నుంచి రూ.48కి, బియ్యం(రా) కిలో రూ.48 నుంచి రూ.47 కి తగ్గించి విక్రయించనున్నట్లు తెలిపారు.

Similar News

News May 7, 2025

ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలి: కలెక్టర్

image

ఉపాధి వేతనదారులకు దినసరి వేతనం పెరిగేలా పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధి పనుల తీరు, వేతనదారులు అందుకుంటున్న సగటు వేతనంపై సమీక్షించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలని చెప్పారు. ఉదయాన్నే వీలైనంత వేగంగా పని మొదలయ్యేలా చూడాలన్నారు. రెండుపూటలా కనీసం 6 గంటలు పనులు చేయించాలని ఆదేశించారు.

News May 7, 2025

అంతర్ జిల్లాల బదిలీలు చేయాలి: ఏపీటీఎఫ్

image

ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లా బదిలీలు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.సింహాచలం, బి.జోగినాయుడు డిమాండ్ చేశారు. బొబ్బిలి పట్టణంలో శనివారం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లాల బదిలీలు చేసి స్పోజ్ కేటగిరీలో ఎంటీఎస్ టీచర్లను పరిగణించాలన్నారు. 1998/2008 ఎంటీఎస్ టీచర్ల బదిలీలు కూడా రెగ్యులర్ టీచర్లతో చేయాలన్నారు. సింగిల్ టీచర్ పాఠశాలలకు రెండో టీచర్‌ను నియమించాలన్నారు.

News May 7, 2025

భోగాపురం మండలంలో ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్

image

భోగాపురం మండలంలోని పోలిపల్లి, కౌలువాడ, లింగాలవలసలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ డ్వామా పీడీ శారదా కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారని ఏపీఓ భాగ్యలక్ష్మి తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.