News June 22, 2024
విజయవాడ: ప్రభుత్వానికి దేవీ సీఫుడ్స్ రూ.5కోట్ల విరాళం
కనెక్ట్ టు ఆంధ్రాకు దేవీ సీఫుడ్స్ సంస్థ రూ.5 కోట్ల విరాళాన్ని అందించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిమిత్తం ఈ మొత్తాన్ని అందించినట్లు తెలిపింది. రూ.5 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పోట్రు బ్రహ్మానందం శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి అందించారు.
Similar News
News October 6, 2024
ప్రయాణికుల రద్దీ మేరకు బెంగుళూరుకు ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టిన్సుఖియా (NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 7 నుంచి డిసెంబర్ 26 వరకు ప్రతి గురువారం NTSK-SMVB(నం.05952), నవంబర్ 11 నుంచి డిసెంబర్ 30 వరకు ప్రతి సోమవారం SMVB-NTSK(నం.05951)మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News October 6, 2024
విజయవాడలో ‘జనక అయితే గనక’ స్పెషల్ షో
ఈ నెల 12న రిలీజ్ కానున్న ‘జనక అయితే గనక’ సినిమా స్పెషల్ షోను ఆదివారం మధ్యాహ్నం 1.30గంటలకు విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్లో ప్రదర్శించనున్నారు. సినీ హీరో సుహాస్, హీరోయిన్ సంగీర్తన, ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రేక్షకులతో కలిసి సినిమాను తిలకించనున్నారు. షో అనంతరం 3 గంటలకు చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడనున్నారు.
News October 6, 2024
కృష్ణా: దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక రైళ్లు
దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 7,8,9 తేదీల్లో CHE- BZA(నం.07216) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లుపై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.