News May 28, 2024

విజయవాడలో సీఎం జగన్‌పై దాడి కేసులో నేడు తీర్పు

image

ఏప్రిల్ 13న విజయవాడలో జగన్‌పై గులకరాయి దాడి కేసు విచారణలో భాగంగా నేడు తీర్పు రానుంది. ఈ కేసు విచారిస్తున్న విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు మంగళవారానికి తీర్పును రిజర్వ్ చేసింది. కేసు విచారణలో భాగంగా అరెస్టైన సతీశ్‌ను అక్రమంగా ఇరికించారని అతడి తరఫు లాయర్ సలీం కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ సతీశ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనుంది.

Similar News

News October 9, 2024

విజయవాడ: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్య సూసైడ్ UPDATE

image

అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన నాగరాజు మంగళవారం BRTSరోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అతని భార్య ఉష ఉరేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. గుణదల కుమ్మరి బజార్‌కు చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై భానునగర్ నుంచి పడవలరేవు వైపు రాంగ్ రూట్‌లో వెళుతూ నాగరాజు బైక్‌ను ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఉష పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

News October 9, 2024

జగన్ కుట్రలకు ఫలితమే 11 సీట్లు: ఉమా

image

తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఉండి అనేక అక్రమాలకు పాల్పడిన ఘటనకు ప్రతిఫలంగా ప్రజలు 11 సీట్లకి పరిమితం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పది రోజులు విజయవాడలో ఉండి వరద బాధితులను ఆదుకుంటే, ఆ సమయంలో ప్రతిపక్ష నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు.

News October 8, 2024

విజయవాడ: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్య సూసైడ్

image

విజయవాడలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అజిత్ సింగ్ నగర్‌కు చెందిన నాగరాజు ప్రసాదంపాడులో వంట మాస్టర్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బీఆర్టీఎస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నాగనాజు భార్య ఉష ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.