News April 8, 2025
విడపనకల్: నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

విడపనకల్లో మంగళవారం ప్రజా సమస్యల పరిష్కారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు. ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 17, 2025
ATP: గ్రామస్థాయిలో సమస్యలను పరిష్కరించాలి- కలెక్టర్

అనంతపురం జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన అర్జీలను వదిలిపెట్టకుండా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం గుంతకల్లు రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామస్థాయిలో నాణ్యతగా సమస్యలను పరిష్కరించాలన్నారు. వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
News April 17, 2025
‘ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలు ఉపయోగించుకోవాలి’

ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) 95523 00009 కు హాయ్ అనండి… హాయిగా సేవలు పొందాలన్నారు.
News April 16, 2025
ATP: దోమల నివారణే ధ్యేయంగా పనిచేయాలి: డీఎంఓ

దోమల నివారణే ధ్యేయంగా పనిచేయాలని DMO ఓబులు పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి అనంతపురం జిల్లాలోని 32 మండలాలలోని 64 గ్రామాలలో ఫైలేరియా వ్యాధి రక్తపూతల సర్వే నిర్వహించాలన్నారు. జిల్లా DMHO కార్యాలయంలో సబ్ యూనిట్ మలేరియా అధికారుల సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ.. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు.