News March 13, 2025

విద్యుత్ షాక్‌కు గురై ఆరేళ్ల చిన్నారి మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై చిన్నారి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. డి.హీరేహాళ్ మండలం మురిడికి చెందిన 6ఏళ్ల చిన్నారి అర్పిత స్నానం చేసేందుకు వెళ్తుండగా డోర్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహించి పడిపోయింది. గమనించిన తల్లి రూతమ్మ వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆ ఇంట విషాదం నింపింది.

Similar News

News March 13, 2025

ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలి: ఎస్పీ

image

హోలీ పండుగను శుక్రవారం ఉదయం 6:00 గంటల నుంచి మ.12 గంటల వరకు చేసుకోవాలని సురక్షితమైన రంగులను ఉపయోగించాలని హానికరమైన రసాయనాలను రంగులను వాడకూడదని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని విసరడం కఠినంగా నిషేధిస్తున్నాని, అలాచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News March 13, 2025

కేటిదొడ్డి: ‘చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి’

image

నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఎడమ కాలువ 104వ ప్యాకేజీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గురువారం కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నె, కొండాపురం, మైలగడ్డ గ్రామాల వద్ద సాగునీటి ఆవశ్యకత గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువలను పరిశీలించారు. రైతుల అభ్యర్థన మేరకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.

News March 13, 2025

తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

image

త్రిభాషా వివాదం నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కాపీపై రూపీ సింబల్‌(₹)ను తొలగించింది. రూపీ సింబల్‌కు బదులు తమిళ ‘రూ’ అక్షరాన్ని పేర్కొంది.

error: Content is protected !!