News March 20, 2024
విశాఖ: ఐఎన్ఎస్ డేగాకు యూఎస్ యుద్ధ విమానాలు

భారత్–యూఎస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంప్–2024 విన్యాసాల్లో పాల్గొనేందుకు యూఎస్కు చెందిన యుద్ధ విమానాలు బుధవారం ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నాయి. ఈ అధునాతన, బహుముఖ యుద్ధ విమానాలు భారత నావికాదళం, వైమానిక దళాలతో కలిసి విన్యాసాలు చేయనున్నాయి. భారత్, యూఎస్ రక్షణ రంగ సంబంధాలు మరింత పెంపొందించేందుకు ఈ ప్రదర్శన దోహదం చేస్తుందని ఇరు దేశాల అధికారులు చెబుతున్నారు.
Similar News
News April 2, 2025
విశాఖ: టీచర్ల సమస్యలపై ప్రభుత్వ విప్కు వినతి

రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి రావుని మంగళవారం ఏపీటీఎఫ్ యూనియన్ నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు. విశాఖలోని ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కార్యాలయంలో సమావేశమైన యూనియన్ నాయకులు, ఉపాధ్యాయుల జీత భత్యాలు, పదోన్నతులు, బదిలీలతో పాటు ఇతర సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
News April 1, 2025
విశాఖలో ఒడిశా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

ఒడిశా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు విశాఖలోని ఆలిండియా రేడియో సమీపంలోని ఉత్కల్ సాంస్కృతిక సమాజ్ ప్రాంగణంలో మంగళవారం జరిగాయి. ఒడిశా ఫుడ్ ఫెస్టివల్ లో కాకారా చెనాపోడా, దహి బారా, గుగుని, మాల్పువా ఆహార పదార్థాలను ప్రదర్శించారు. ఉత్కల్ గౌరబ్ మధు సుదాన్ దాస్, ఉత్కలనీ గోపాబాధి వంటి గొప్ప వ్యక్తులకు నివాళులర్పించారు. ఐఆర్ఎస్ అధికారి రాజేంద్ర కుమార్, రైల్వే ఏడిఆర్ఎం మనోజ్ కుమార్ సాహు పాల్గొన్నారు.
News April 1, 2025
ఇప్పటి వరకు ఏడుగురు అరెస్ట్: విశాఖ సీపీ

ఆన్లైన్ లోన్ యాప్లో అప్పు తీసుకొని వేధింపులకు గురై విశాఖలో ఓ వ్వక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఈ కేసు విచారణలో భాగంగా అప్పుడు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ పోలీసులు వివిధ రాష్ట్రలకు వెళ్లి మరికొందరిని మంగళవారం అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఆ కేసులో ఏడుగురుని అరెస్ట్ చేశారు. త్వరలో మిగతా ముద్దాయిలను పట్టుకుంటామని సీపీ వెల్లడించారు.