News October 3, 2024
విశాఖ: దసరాకు ప్రత్యేక బస్ సర్వీసులు
దసరా సందర్భంగా విశాఖ నుంచి పలు ప్రాంతాలకు 250 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు తెలిపారు. ప్రత్యేక సర్వీసులకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు. హైదరాబాద్కు 40, విజయవాడకు 40 నుంచి 50, రాజమండ్రి, కాకినాడ సెక్టార్కు 40 అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సర్వీసులు నడుపుతామన్నారు.
Similar News
News October 7, 2024
విశాఖలో ఆస్తి కోసం హత్య
మల్కాపురంలో ఈనెల 3న జరిగిన వాసు హత్య కేసు వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ కేసులో నిందితుడు పవన్ సాయిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ విద్యాసాగర్ తెలిపారు. ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు గుర్తించామన్నారు. వాసు అన్న సింహాచలం మొదటి భార్య కుమారుడు పవన్ సాయిని పిలిపించి దాడి చేశారని సీఐ తెలిపారు.
News October 7, 2024
కేజీహెచ్లో నూతన భోజన కౌంటర్ ప్రారంభం
కేజీహెచ్లో హరే కృష్ణ మూవ్ మెంట్ టచ్ స్టోన్ ఛారిటీస్ వారి సౌజన్యంతో భోజనం నూతన భోజనం కౌంటర్ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. రోగుల బంధువుల కోసం భోజనం కౌంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రోగులకు మరిన్ని సేవలు అందించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంటెంట్ శివానంద తదితరులు పాల్గొన్నారు.
News October 7, 2024
‘సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనానికి తీర్మానం’
విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెయిల్ సభ్యుడు సాగి విశ్వనాథరాజు అన్నారు. సోమవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సెయిల్లో స్టీల్ ప్లాంట్ను విలీనం చేస్తే స్టీల్ టన్నుకు రూ.10,000 తగ్గుతుందన్నారు. ఏపీలో ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి సెయిల్లో విలీనం చేయాలని తీర్మానించడం జరిగిందన్నారు.