News June 23, 2024
విశాఖ: మంత్రి నారా లోకేశ్కు లేఖ
ఐటీ రంగ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్కు విశాఖ ఐటి పార్క్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఓ.నరేష్ కుమార్ లేఖ రాశారు. మిలీనియం టవర్లను 10 ప్రముఖ ఐటి కంపెనీలకు 3 సంవత్సరాలకు ఉచితంగా కేటాయించాలని, తద్వారా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందన్నారు. హిల్ నెంబర్ 2,3లో ఉన్న పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని నూతన కంపెనీలకు 50 శాతం సబ్సిడీపై అందించాలని, నూతన ఐటీ పాలసీ అమలు చేయాలన్నారు.
Similar News
News October 5, 2024
విశాఖ: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాలిక మృతి
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పుంగనూరులో అదృశ్యమైన బాలిక మృతిచెందిందని ఎమ్మెల్సీ, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆరోపించారు. పోలీసులు సరైన రీతిలో స్పందించి ఉంటే తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేది కాదన్నారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ.. కాలిన కాగితాలకున్న విలువ ఆడబిడ్డల ప్రాణాలకు లేదని విమర్శించారు. బాలిక మృతి సంఘటనను దర్యాప్తు లేకుండానే నీరు గార్చాలని పోలీసులు చూస్తున్నట్లు తెలిపారు.
News October 5, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. విజయవాడ BLP రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కార్మికులు భద్రత కోసం ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వారికి హాని తలపెట్టమని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.
News October 5, 2024
విశాఖలో అర్ధరాత్రి దారుణ హత్య
విశాఖలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. మల్కాపురంలోని యువకుడు వాసుకు తన సోదరులతో వివాదం చోటు చేసుకోగా ఈ ఘటన జరిగింది. వాసు తలపై రాడ్డుతో కొట్టడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.