News April 4, 2025

విశాఖ మేయర్ పీఠంపై ఎవరి ధీమా వారిదే..!

image

విశాఖ మేయర్ పీఠంపై ఎవరి ధీమా వారికే ఉంది. మొత్తం 98 కార్పోరేషన్లకు గాను ఒక స్థానం ఖాళీగా ఉంది. 14 మంది ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి 111 ఓట్లు ఉన్నాయి. అవిశ్వాసం నెగ్గాలంటే 2/3 సభ్యుల మద్ధతు అవసరం. ఇప్పటికే 71 మంది మద్ధతు తమకు ఉందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. YCP కార్పొరేటర్లు తమతోనే ఉన్నారని ఆ పార్టీ పెద్దలు చెప్తుతున్నారు. మరి వీరిలో ఎవరు నెగ్గుతారో చూడాలంటే ఈనెల 19 వరకు ఆగాల్సిందే.

Similar News

News April 18, 2025

వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడింది: విశాఖ ఎంపీ

image

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ విమర్శించారు. శుక్రవారం విశాఖ జిల్లా టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విశాఖలో 33 ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారని, రుషికొండ ప్యాలెస్‌కు రూ.450కోట్లు YCPప్రభుత్వం ఖర్చుపెట్టిందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్టుకు రోడ్డు కనెక్టివిటీ, విశాఖలో TCSకు ప్రతిపాదనలు చేశామన్నారు.

News April 18, 2025

ప్రజాస్వామ్య పద్ధతిలో సంస్థాగత ఎన్నికలు: ఎంపీ శ్రీభరత్

image

T.D.P. సంస్థాగత ఎన్నికల్లో అందరి అభిప్రాయాలు తీసుకుని కమిటీలను ఎన్నుకోవాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ సూచించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకాభిప్రాయం కుదరకపోతే జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ రామారావు తదితరులు పాల్గొన్నారు.

News April 18, 2025

రుషికొండలో తిరుమల విక్రయాలు పునఃప్రారంభం

image

రుషికొండ శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ విక్రయాలు శనివారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఇటీవల ఒంటిమిట్ట సీతారామ కల్యాణోత్సవం కోసం లడ్డూలు తరలించడంతో అమ్మకాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు భక్తులకోసం ఆలయంలోనే కౌంటర్ ద్వారా లడ్డూల విక్రయాలు ఏప్రిల్ 19వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభమవుతాయని ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు శుక్రవారం తెలిపారు.

error: Content is protected !!