News February 25, 2025

విశాఖలో ఆర్డీవోకు చుక్కెదురు

image

విశాఖలోని ఓ దినపత్రికపై మీద ఎదురుదాడి చేసిన అధికార యంత్రాంగానికి హైకోర్టులో చుక్కెదురైంది. లీడర్ దినపత్రిక సంపాదకులు రమణ మూర్తికి ఆర్‌డీవో శ్రీలేఖ ఇచ్చిన నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు అలాగే ఆర్‌డీవో ఇచ్చిన నోటిస్‌పై 3 వారాలులోగా పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

Similar News

News February 25, 2025

విశాఖ: ఈనెల 27న పారిశుద్ధ్య కార్మికులకు సెలవు

image

జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి రోజున కార్మికులు విధులకు హాజరై యథావిధిగా వ్యర్థాలను సేకరిస్తారని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి నరేశ్ తెలిపారు. దీంతో వారికి ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించారు. నగర ప్రజలు ఫిబ్రవరి 27వ తేదీన వ్యర్థాలను వీధులలో, బహిరంగ ప్రదేశాలలో, పబ్లిక్ బిన్లలో పడేయవద్దని సూచించారు. ఫిబ్రవరి 28న(శుక్రవారం) పారిశుద్ధ్య సిబ్బందికి చెత్తను అందజేయాలన్నారు.

News February 25, 2025

ఎమ్మెల్సీ అభ్యర్థులతో విశాఖ కలెక్టర్ సమావేశం 

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో నిర్వహించేందుకు అభ్య‌ర్థులు పూర్తి సహాయ స‌హ‌కారాలు అందించాల‌ని రిట‌ర్నింగ్ అధికారి, క‌లెక్ట‌ర్ హరేంద్ర ప్ర‌సాద్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం ప్రచార ప్ర‌క్రియ గ‌డువు ముగిసిన వెంట‌నే పోటీలో ఉన్న అభ్య‌ర్థులు అనుసరించవలసిన విధానాలపై వారికి వివరించారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుపై పలు సూచనలు చేశారు.

News February 25, 2025

విశాఖ: 123 పోలింగ్ కేంద్రాలు.. 22,493 మంది ఓటర్లు

image

ఉత్త‌రాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారి హరేంద్ర ప్రసాద్ తెలిపారు. 123 పోలింగ్ కేంద్రాలలో 22,493 మంది టీచర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడించారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా 144 సెక్ష‌న్ విధిస్తామ‌న్నారు. ఎన్నిక‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించేందుకు 739 మంది అధికారుల‌ను, సిబ్బందిని కేటాయించామ‌న్నారు. 148 మంది పీవోలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

error: Content is protected !!