News February 3, 2025
విశాఖలో ఎలక్ట్రీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ
విశాఖలో న్యాక్ ద్వారా నిరుద్యోగులకు ఎలక్ట్రీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసి 15-45 సం.లోపు వారికి 3 నెలల శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టారులో ఉపాధి కల్పిస్తారని చెప్పారు. మహారాణిపేట న్యాక్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ అందిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News February 3, 2025
విశాఖలో ఆరుగురిపై PD యాక్ట్..!
రాష్ట్రంలో పలువురిపై PD యాక్ట్ అమలు చేస్తూ స్టేట్ గవర్నమెంట్ ఆదివారం రాత్రి GO విడుదల చేసింది. వారిలో విశాఖకు చెందిన రావాడ జగదీశ్, రావాడ ఉదయ్ భాస్కర్, ఈతలపాక రాజ్ కుమార్, కొలగాన పవన్ రాజ్ కుమార్, నక్కా లోకేశ్, కాండ్రేగుల లోక్ నాథ్ వీర సాయి శ్రీనివాస్ ఉన్నారు. ఎయిర్ పోర్టు, పీఎం పాలెం, ఆరిలోవ, దువ్వాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు.
News February 3, 2025
విశాఖ: యాక్సిడెంట్లో టీచర్ మృతి
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కనిమెల్ల జంక్షన్ సమీపంలో హైవేపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పీఎం పాలెంకు చెందిన సౌజన్య అనే ఉపాధ్యాయురాలు మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. సౌజన్య భోగాపురం మండలం పోలిపల్లి ఉన్నత పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు.
News February 2, 2025
ఢిల్లీ ఎన్నికల్లో విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రచారం
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఢిల్లీలోని షాలిమార్ ప్రాంతంలో ఆయన తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే కాలనీలో ప్రచారం చేశారు. ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన ఆటోలో ప్రయాణించారు.