News March 25, 2025
విశాఖలో ఐపీఎల్ మ్యాచ్.. వారికి తీపి జ్ఞాపకం

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ 30 మంది అనాథ చిన్నారులకు చూసే అవకాశం కల్పించింది. సొంత నిధులతో 30 టికెట్స్ కొని వైజాగ్లోని పాపా హోమ్ అనాథ శరణాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు చిన్నారులు స్టేడియానికి వెళ్లారు.
Similar News
News March 29, 2025
క్షయ వ్యాధి నియంత్రణలో విజయనగరానికి జాతీయ స్థాయి గుర్తింపు

క్షయ వ్యాధి నియంత్రణలో విజయనగరం జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించినట్లు కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ఈ వ్యాధి నియంత్రణలో భాగంగా వ్యాధిగ్రస్థుల గుర్తింపులో జిల్లా ముందు వరుసలో నిలిచిందన్నారు. వ్యాధి నియంత్రణకై చేపట్టిన ప్రత్యేక వందరోజుల కార్యక్రమంలో దేశంలోనే అత్యధిక క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసిన జిల్లాగా విజయనగరం నిలిచినట్లు పేర్కొన్నారు. సిబ్బందిని అభినందించారు.
News March 28, 2025
31న జరగాల్సిన టెన్త్ సోషల్ ఎగ్జామ్ వాయిదా

ఈ నెల 31న జరగాల్సిన సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసినట్లు డీఈవో మాణిక్యం నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 31న రంజాన్ కారణంగా పరీక్ష వాయిదా వేసినట్లు చెప్పారు. 31న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ ఒకటిన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతుందని, విద్యార్థులు గమనించాలని కోరారు.
News March 28, 2025
VZM: శుభలేఖ సుధాకర్, SP శైలజకు జీవిత సాఫల్య పురస్కారం

ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్, సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజకు కళాపీఠం జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నామని కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బిఏ నారాయణ తెలిపారు. ఏప్రిల్ 1 న ఆనంద గజపతి కళాక్షేత్రంలో కళా పీఠం నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని పద్మభూషణ్, గానకోకిల పి.సుశీల పాల్గొంటారన్నారు.