News April 4, 2024
వీర్నపల్లి: సరదాగా ఈతకు వెళ్లి విద్యార్థి దుర్మరణం

వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన ఓ విద్యార్థి ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆలకుంట హరికృష్ణ(16) వీర్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. గురువారం సరదాగా అల్మాస్పూర్ గ్రామ శివారులో ఉన్న రంగ చెరువులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు.
Similar News
News April 22, 2025
464/470 సాధించిన కేశవపట్నం కస్తూర్బా విద్యార్థిని

ఓదెల మండలంలోని గుంపులకు చెందిన పంజాల స్వాతి కేశవపట్నంలోని కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. పేద కుటుంబానికి చెందిన స్వాతి ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో 464/470 మార్కులు సాధించింది. కస్తూర్బా పాఠశాల టాపర్గా నిలిచింది. పాఠశాల హెచ్ఎం స్వాతికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధిస్తానని ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమన్నారు.
News April 22, 2025
కరీంనగర్: ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 68.23 శాతం

ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 17,794 మందికి 12,141 మంది పాసయ్యారు. 68.23 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. సెకండ్ ఇయర్లో 15,187 మంది పరీక్షలు రాయగా 11,092 మంది పాసయ్యారు. 73.04 శాతం పర్సంటేజీ వచ్చింది.
News April 22, 2025
కొత్తపల్లి చెరువులో దొరికిన మృతదేహం వివరాలు లభ్యం

కరీంనగర్ కొత్తపల్లి హవేలీ చెరువులో యువకుడి మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి భార్గవ్గా పోలీసులు గుర్తించారు. భార్గవ్ తల్లిదండ్రులు కొత్తపల్లికి చెందిన పబ్బోజు నాగరాజు యాదలక్ష్మి కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఈ క్రమంలో కొత్తపెళ్లి చెరువు వద్ద మృతదేహం లభించడంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.