News April 16, 2025
వెంటనే నివేదికలు పంపండి: నాగర్కర్నూల్ ఎంపీ

నాగర్కర్నూల్ జిల్లాలో ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల నివేదికలను వెంటనే పంపాలని ఎంపీ డాక్టర్ మల్లురవి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలాల తహశీల్దార్లు మామిడి, వరి, ఇతర పంటలను నష్ట పోయిన రైతుల వివరాలను కలెక్టరేట్లో అందివ్వాలని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తోందని, రైతులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.
Similar News
News April 16, 2025
SKLM: అశ్లీల స్ట్రీమింగ్ ముఠా అరెస్ట్

నిషేధిత వెబ్సైట్లపై లైవ్ న్యూడ్ వీడియోలు ప్రసారం చేస్తున్న సిక్కోలుకు చెందిన ఇద్దరిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు ఐజీ రవికృష్ణ తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం, గుంతకల్లుకు చెందిన ముగ్గురు నిందితులు గణేశ్, జ్యోత్స్న, లౌయిస్ అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 3 కేసులు నమోదు చేశారు. ముఠా మరెంత మంది బాధితులను టార్గెట్ చేసిందన్న విషయంపై విచారణ సాగుతోంది.
News April 16, 2025
VZM: స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు

విజయనగరం ఉమ్మడి జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్యను అందించేందుకు నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ప్రైమరీ లెవెల్ SGTలు 45, సెకండరీ లెవెల్ స్కూల్ అసిస్టెంట్లు 115 కాగా గతంలోనే 49 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 66 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.
News April 16, 2025
ఖమ్మం జిల్లా ప్రజలకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి

ఖమ్మం జిల్లా ప్రజలకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో తమ ప్రాంతాల్లో విద్యుత్తు లైన్ల పై చెట్టుకొమ్మలు లేదా స్తంభాలు విరిగిపడినట్లు ఉంటే వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలన్నారు. విద్యుత్ సంబంధిత సమస్యలు ఉంటే 1912 నంబర్ కు కాల్, లేదా విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని విద్యుత్ అధికారులు ప్రకటించారు.