News April 6, 2025
వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన ఖరారు

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన ఖరారైంది. ఈ నెల 8న పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. ఇటీవల ప్రత్యర్థుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ పర్యటన వేళ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైసీపీ కీలక నేతలు శనివారం సమావేశం నిర్వహించి చర్చించారు.
Similar News
News April 8, 2025
ఆత్రేయపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో లారీ ఢీకొని గుర్తుతెలియని యువకుడు మంగళవారం మృతి చెందాడు. ఏపీ 37 3865 నంబర్ కలిగిన బైక్పై వెళ్తున్న యువకుడిని ఇసుక లోడుకు వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఆత్రేయపురం పోలీసులు విచారణ చేపట్టారు.
News April 8, 2025
పవన్ కాన్వాయ్ వివాదం.. విశాఖ సీపీ వివరణ

AP: Dy.CM పవన్ కాన్వాయ్ వల్ల 30 మంది విద్యార్థులు JEE ఎగ్జామ్ రాయలేకపోయారన్న ఆరోపణలపై విశాఖ CP బాగ్చి స్పష్టతనిచ్చారు. ‘పోలీసుల వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగలేదు. Dy.CM కాన్వాయ్ వల్ల ఆలస్యం అయ్యిందన్న ఆరోపణల్లో నిజం లేదు. మేం ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదు. సీసీటీవీ ఫుటేజ్, లేటుగా వచ్చిన విద్యార్థుల ఫోన్లను ట్రాక్ చేశాం. వాళ్లే లేటుగా వచ్చి పోలీసులపై నిందలేస్తున్నారు’ అని వివరణ ఇచ్చారు.
News April 8, 2025
‘రాజాసాబ్’ రిలీజ్పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ మూవీపై డైరెక్టర్ మారుతి ఓ అప్డేట్ ఇచ్చారు. ‘సీజీ వర్క్ కంప్లీట్ కాగానే ‘రాజా సాబ్’ మూవీ విడుదల తేదీని నిర్మాతలు ప్రకటిస్తారు. ఈ సినిమా విడుదలకు మరికొంత సమయం పడుతుంది. అప్పటివరకు కొంచెం ఓపిక పట్టండి. మీ అంచనాలు అందుకునేందుకు మేం తీవ్రంగా శ్రమిస్తున్నాం. మా హార్డ్ వర్క్ను చూపించేందుకు ఎదురు చూస్తున్నాం’ అని పేర్కొన్నారు.