News April 4, 2025
వైఎస్ షర్మిలతో పులివెందుల ఇన్ఛార్జ్ భేటీ

పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మూలంరెడ్డి ధ్రువకుమార్రెడ్డి గురువారం విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుశారు. అనంతరం పార్టీ పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ భేటీ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి అవసరమైన వ్యూహాలను అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News April 11, 2025
కడప జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

కడప జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 64 పరీక్షా కేంద్రాల్లో 32,885 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 17,114 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 15,771 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 11, 2025
ఒంటిమిట్ట రామదాసు ఈయనే..

భద్రాచలంలో రాములోరికి గుడి నిర్మించి రామదాసు చరిత్రలో నిలిచిపోయారు. ఒంటిమిట్ట రామాలయానికి ఆ స్థాయిలోనే కృషి చేశారు వావిలికొలను సుబ్బారావు. 1863 జనవరి 23న ప్రొద్దుటూరులో జన్మించిన ఆయన ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం టెంకాయ చిప్ప చేత పట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఊరూరా తిరిగారు. భిక్షంగా వచ్చిన నగదును ఆలయ అభివృద్ధికి ఖర్చు చేశారు. 1936, ఆగస్టు 1న మద్రాసులో కన్నుమూశారు.
News April 11, 2025
ఒంటిమిట్ట కళ్యాణోత్సవం.. భారీ బందోబస్తు

ఒంటిమిట్ట సీతారామ కళ్యాణ మహోత్సవానికి శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు హాజరు కానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. నలుగురు ఏఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 73 మంది సీఐలు, 177 మంది ఎస్ఐలు, 1700 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోం గార్డులు బందోబస్తులో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.