News April 4, 2025
వైసీపీ నేతలను జైలుకు పంపడమే వారి లక్ష్యం: మేరిగ

రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలోనూ టీడీపీ నాయకులు కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళి మండిపడ్డారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్యాయంగా, అక్రమంగా వైసీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు. ఎంతో సౌమ్యుడిగా, మంచి పేరున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టటం దారుణమన్నారు.
Similar News
News April 17, 2025
నెల్లూరులో వ్యక్తి దారుణ హత్య

నెల్లూరు టు టౌన్ పరిధిలో సుల్తాన్(40) దారుణ హత్యకు గురయ్యారు. జాకీర్ హుస్సేన్ నగర్, పెన్నా శివారు ప్రాంతంలో బుధవారం రాత్రి దుండగులు ఆయన తల పగలగొట్టి హత్యచేసినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నవాబుపేట సీఐ అన్వర్ బాషా సిబ్బంది పరిసరాలను పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 16, 2025
41 రైతు సంఘాలకు డ్రోన్ల పంపిణీ: జేసీ కార్తీక్

వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలని నెల్లూరు జేసీ కార్తీక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో మెరుగైన ఆదాయం పొందేందుకు శాస్త్ర సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. జిల్లాలో 41 రైతు సంఘాలకు డ్రోన్స్ ఇస్తున్నట్లు కార్తీక్ పేర్కొన్నారు.
News April 16, 2025
NLR: యువతిని బెదిరించి చైన్ దోచుకెళ్లాడు

ఓ యువతిని బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లిన ఘటన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వద్ద జరిగింది. బాలాజీనగర్ పోలీసుల సమాచారం మేరకు..మర్రిపాడుకు చెందిన రీమాశేఖర్ నారాయణ వైద్యశాలలో బయోమెడికల్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. ఈనెల 11వ తేదీ స్నేహితుడితో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి బెదిరించి గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు.