News April 13, 2025

వైసీపీ పీఏసీ కమిటీలో కడప జిల్లా నాయకులకు చోటు

image

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో కడప జిల్లాకు చెందిన నాయకులకు అధిష్ఠానం చోటు కల్పించింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలకు పీఏసీ కమిటీలో స్థానం కల్పిస్తూ  వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ పీఏసీ కన్వీనర్‌గా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు ఉంటారు.

Similar News

News April 15, 2025

కడప: రూ.1.8 కోట్ల విలువచేసే 602 ఫోన్ల రికవరీ

image

కడప జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా విశ్లేషణ పద్ధతులు ఉపయోగించి భారీగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేశారు. కడపలోని ఎస్పీ ఆఫీస్ ప్రాంగణంలోని పెన్నేరు హాల్‌లో ఎస్పీ అశోక్ కుమార్ మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సుమారు రూ.1.8 కోట్ల విలువచేసే 602 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు.

News April 15, 2025

నేడు మొబైల్ రికవరీ మేళా: ఎస్పీ

image

కడప జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్స్‌ను బాధితులకు అందజేసేందుకు ఈ రోజు మొబైల్ రికవరీ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులు సరైన రికార్డులు తీసుకుని వస్తే మొబైల్స్ అందజేస్తామన్నారు

News April 14, 2025

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన కడప జిల్లాలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద కడప నుంచి వస్తున్న బస్సు, పోలీసుల బొలెరోను జీపు ఢీకొంది. ఈ ప్రమాంలో పోలీసుల బొలెరోలోని కానిస్టేబుల్, డ్రైవర్‌కు గాయాలు కాగా.. జీపులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. మృతులు నంద్యాల హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులుగా తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!