News October 1, 2024

వైసీపీలో తాడేపల్లిగూడెం నాయకుడికి కీలక బాధ్యతలు

image

వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వడ్డీ రఘురాం నాయుడును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో రఘురాం నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Similar News

News October 1, 2024

రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలకు ఇరగవరం విద్యార్థి

image

ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని గూనా గౌరిదానేశ్వరి రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపికైంది. మంగళవారం భీమవరంలో పీఎస్‌ఎం బాలికల పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో స్వర్ణాంధ్ర 2047 జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది.

News October 1, 2024

వరద బాధితులకు భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ విరాళం

image

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమని, వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం రూ.1,50,116 విరాళాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వారిని అభినందించారు.

News October 1, 2024

భీమవరంలో యువకుడి ఆత్మహత్య

image

భీమవరంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన కె.మణికంఠ కుమార్(32) సోమవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మంగళవారం ఉదయం అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.