News March 5, 2025
శంబరలో తగ్గని భక్తుల రద్దీ

శంబర పోలమాంబ అమ్మవారి ఆరోవారం జాతర మంగళవారం ఘనంగా జరిగింది. చదురుగుడి, వనంగుడి వద్దకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. పలువురు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణ అధికారి వీవీ సూర్యనారాయణ తెలిపారు.
Similar News
News December 14, 2025
మెస్సీ వెంట ఉన్న ప్లేయర్ల గురించి తెలుసా?

ఫుట్బాల్ స్టార్ మెస్సీతో, ఇద్దరు ప్లేయర్లు రోడ్రిగో డిపాల్(అర్జెంటీనా), లూయిస్ సువారెజ్(ఉరుగ్వే) భారత పర్యటనలో ఉన్నారు. వీరు US మేజర్ లీగ్ సాకర్ క్లబ్ ఇంటర్ మయామికి ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. మిడ్ ఫీల్డర్ అయిన రోడ్రిగో(RHS).. 2022లో ఫిఫా వరల్డ్కప్ గెలిచిన అర్జెంటీనా జట్టులో సభ్యుడు. మరో ప్లేయర్ సువారెజ్(LHS) స్ట్రైకర్గా పేరొందారు. యూరప్ లీగ్లో 2 సార్లు గోల్డెన్ బూట్ గెలుచుకున్నారు.
News December 14, 2025
KMR: ఉత్కంఠ పోరు.. GP పీఠం కోసం నానా తంటాలు!

కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న 2వ విడత GP ఎన్నికలు పలు చోట్ల అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అత్యంత రసవత్తరంగా సాగుతున్న ఈ పోరులో అభ్యర్థులు విజయం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నదైనా, పెద్దదైనా గ్రామ పంచాయతీ పీఠాన్ని దక్కించుకోవడానికి అభ్యర్థులు చేస్తున్న ఖర్చు, అనుసరిస్తున్న వ్యూహాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
News December 14, 2025
INDvsSA.. గెలుపు ఎవరిదో?

టీ20 సిరీస్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా ఇవాళ టీమ్ ఇండియాతో దక్షిణాఫ్రికా మూడో మ్యాచ్ ఆడనుంది. తొలి రెండు మ్యాచుల్లో చెరో విజయంతో ఇరు జట్ల ఫోకస్ ఈ మ్యాచ్ నెగ్గడంపైనే ఉంది. రెండో T20లో నెగ్గిన సఫారీ ప్లేయర్లు అదే జోష్లో ఉన్నారు. అటు ఓటమితో కంగుతిన్న టీమ్ ఇండియా ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని కసిగా ఉంది. మ్యాచ్ 7pm నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్లో లైవ్ చూడవచ్చు.


