News March 21, 2024
శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలి: సీపీ

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా స్ధానిక పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. ముందు జాగ్రత్తగా రౌడీ షీటర్లు కదలికలపై పోలీసు నిఘా పెట్టాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకోవాలకున్నారు.
Similar News
News April 15, 2025
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్

HYDలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ హోదాలో కలెక్టర్ డా. పి.శ్రీజ పాల్గొన్నారు. భూ భారతి పోర్టల్, ఇందిరమ్మ ఇండ్లు, వేసవిలో తాగు నీటి ప్రణాళికలపై సీఎం చర్చించినట్లు ఇన్చార్జ్ కలెక్టర్ తెలిపారు. భూ భారతి పైలెట్ ప్రాజెక్టు సదస్సులను ఆయా మండలాల్లో ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో సదస్సులు నిర్వహించాలని సీఎం చెప్పారన్నారు.
News April 14, 2025
ఖమ్మం: కేఎంసీలో ప్రత్యేక కౌంటర్ల వద్ద దరఖాస్తుల స్వీకరణ

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. దీంతో దరఖాస్తులను స్వీకరించేందుకు ఖమ్మం కేఎంసీ అధికారులు సోమవారం ప్రత్యేక కౌంటర్లు తెరిచేలా ప్రణాళికలు సిద్ధం చేసి కౌంటర్లను తెరిచి ఉంచాలని నిర్ణయించారు. మెప్మా సిబ్బంది ఈ కౌంటర్ల వద్ద దరఖాస్తుదారులకు రశీదులు ఇవ్వనున్నారు. ఈ కౌంటర్ల వద్ద ఆఫ్లైన్ దరఖాస్తులను సిబ్బంది తీసుకోనున్నారు. కాగా, ఇప్పటికే కేఎంసీ పరిధిలో 6,166 దరఖాస్తులు వచ్చాయి.
News April 14, 2025
లాయర్లకు న్యాయం జరిగేలా చూడాలని ఎంపీకి వినతి

అడ్వకేట్ అమండ్మెంట్ బిల్ 2025లో ఉన్న లోపాలను సవరించి లాయర్లకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం ఎంపీ రఘు రాంరెడ్డికి వినతిపత్రం అందజేశారు. న్యాయవాద నోటరీ నోటిఫికేషన్ 2021లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహణలో జాప్యం లేకుండా చూడాలని, బాధితులకి సత్వర న్యాయం జరిగేలా నాన్ బెయిలబుల్ కేసుల్లో ఏడేళ్ల లోపు శిక్ష పడే జడ్జిమెంట్ పై చర్చించాలని కోరారు.