News March 20, 2025
శ్రీ సత్యసాయి: 171 మందికి బదిలీలు

జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 171 మందికి బదిలీ ప్రక్రియ నిర్వహించినట్లు డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న వారికి గురువారం బదిలీలు చేపట్టామన్నారు. 21 మంది ఏపీవోలు, 50 మంది కోఆర్డినేటర్స్, 18 మంది ఈసీ, 81 మంది టెక్నికల్ అసిస్టెంట్ల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు.
Similar News
News March 28, 2025
అనకాపల్లి: వచ్చే నెల 1న సాంఘిక శాస్త్రం పరీక్ష

పదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీన రంజాన్ పండగ సందర్భాన్ని పురస్కరించుకుని పరీక్షను 1వ తేదీకి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.
News March 28, 2025
బాపట్ల: ‘పొగాకు రైతులకి న్యాయం చేయాలి’

బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పొగా రైతులు, వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పలువురు రైతులు ప్రజా పరిష్కార వేదిక వద్ద బర్లీ పొగాకు రైతులకి న్యాయం చేయాలని, పంటను కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు.
News March 28, 2025
హెలీప్యాడ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: బాపట్ల కలెక్టర్

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారాచంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను శుక్రవారం ఆదేశించారు. శనివారం సాయంత్రంలోగా ముఖ్యమంత్రి హెలిప్యాడ్ పనులను పూర్తి చేయాలని ఆర్& బీ ఇంజనీర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభా వేదిక వద్ద బ్యారికేడ్లలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ప్రజా వేదికను సౌకర్యవంతంగా తయారు చేయాలన్నారు