News March 4, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 413 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మంగళవారం ఇంగ్లీష్ పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లాలో 12,162 మంది విద్యార్థులకు గానూ 11,749 విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఒకేషనల్ పరీక్షకు సంబంధించి 1,696 మంది విద్యార్థులకు గానూ 1,595 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
Similar News
News March 4, 2025
చీపురుపల్లిలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

చీపురుపల్లి మెయిన్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో గరివిడి మండలం రేగటికి చెందిన కుడుముల బంగారినాయుడు(32) మృతి చెందాడు. చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతరకు తన స్నేహితుడు శనపతి రాముతో కలిసి వచ్చాడు. జాతర నుంచి తిరగివెళ్తుండగా మెయిన్ రోడ్డులో బైక్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న బంగారినాయుడు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
News March 4, 2025
బాపట్ల జిల్లాలో TODAY TOP HEADLINES

★చిన్నారిపై లైంగిక దాడి.. రంగంలోకి క్లూస్ టీం★ఆలపాటి ప్రస్థానం మొదలైంది ఇలా.!★ 2 సార్లు గెలిచి.. ఈసారి ఓడారు.!★అత్యంత పేదరిక జిల్లాల్లో బాపట్ల జిల్లాకు 4వ స్థానం★శరవేగంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు.!★మాజీ MLA ఇంటి ముందు TDP శ్రేణుల సంబరాలు★ జగన్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి: అనగాని★ కారంచేడులో రోడ్డు ప్రమాదం
News March 4, 2025
ధర్మపురి: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

ధర్మపురి మండలం గాదెపల్లిలో రెండు బైకులు ఢీకొని ఒకరు స్పాట్లోనే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా రెండు బైకులు వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఒక వ్యక్తి స్పాట్లోనే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.