News September 13, 2024
శ్రీ సత్యసాయి: బుల్లెట్ వాహనానికి నిప్పు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92024/1726192328569-normal-WIFI.webp)
లేపాక్షి మండలం బిసలమానేపల్లిలో మధుసూదన్ తన ఇంటి వద్ద నిలిపిన బుల్లెట్ వాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో బైక్ పూర్తిగా కాలిపోయి దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా చేశారా? లేక లేక ప్రమాదవశాత్తూ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 21, 2024
అనంతపురం జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734744276147_727-normal-WIFI.webp)
అనంతపురం జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. 2 నెలల వ్యవధిలో మూడు ఘోర ప్రమాదాలు జరగ్గా 18 మంది మృతి చెందారు. అక్టోబర్ 26న శింగనమల సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టిన దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నవంబరు 23న గార్లదిన్నె మం. తలగాసుపల్లె వద్ద ఆటోను RTC బస్సు ఢీకొనడంతో 8 మంది మృతి దుర్మరణం చెందారు. నేడు మడకశిర మండలంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
News December 21, 2024
అనంతలో విషాదం.. యువకుడి సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734700126408_20669948-normal-WIFI.webp)
అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముండే కురుబ శివా అనే యువకుడు శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
News December 21, 2024
ఏపీ అభివృద్ధి కి నిధులు ఇవ్వండి: పయ్యావుల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734714255870_51570700-normal-WIFI.webp)
రాజస్తాన్లో కేంద్రం ఆర్థిక మంత్రి నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక మంత్రుల సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. 2025-26 కేంద్ర బడ్జెట్పై సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలు, ప్రాధాన్యతా రంగాలకు అవసరమైన నిధులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు వివరించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, చేనేత క్లస్టర్ల ఏర్పాటు, ఏవియేషన, పెట్రోల్ యూనివర్సిటీలకు నిధులు ఇవ్వాలని కోరారు.