News March 22, 2024
శ్రీ సత్యసాయి: బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. యువకుడి మృతి

కదిరి మండలం కాళసముద్రంలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు అనంతపురం డిపోకు చెందినదిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు డ్రైవర్పై దాడికి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 20, 2025
జిల్లాలో నేను పెట్టిన రేట్లే ఉండాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి

ప్రైవేటు బస్సు యజమానులపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ఓనర్లం చిల్లర వ్యక్తులం అయ్యామని అన్నారు. తాను అనంతపురం జిల్లాలో మీటింగ్ పెడుతున్నానని తెలిపారు. జిల్లాలో నేను పెట్టిన రేట్లు మాత్రమే ఉండాలని అన్నారు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా బస్సులు తిప్పుకునే స్వేచ్ఛ ఉందన్నారు. తాను మొదటిసారిగా అన్ని ప్రాంతాలకు బస్సులు నడపానని తెలిపారు.
News April 20, 2025
తాడిపత్రి: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

ఉద్యోగం రాలేదని యువకుడు నరసింహ (23) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం తాడిపత్రిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. నరసింహ ఇంజినీరింగ్ చదివాడు. ఉద్యోగం కోసం పలు కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. అయినప్పటికీ ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
ATP: చెత్త సంపద తయారీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

అనంతపురం జిల్లా రూరల్ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సమీపంలోని జాతీయ రహదారిలో ఈ-వేస్ట్ కలెక్షన్ కౌంటర్, చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ-వేస్ట్ ప్రత్యేక నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లను పరిశీలించారు.