News August 21, 2024
శ్రీకాకుళం: APEAP CET ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్
ఏపీఈఏపీ సెట్-2024 చివరి విడత కౌన్సెలింగ్ కు సంబంధించి ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ ఆన్లైన్ వేరిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది. ర్యాంకు వచ్చి కౌన్సెలింగ్ హాజరు కాని విద్యార్థులు, బ్రాంచ్ మార్చుకుని అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు కౌన్సెలింగ్ సమయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా SKLM ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News October 7, 2024
SKLM: జిల్లా పంచాయతీ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరణ
జిల్లా పంచాయతీ అధికారిగా కె. భారతి సౌజన్య సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమె కాకినాడ డీపీఓ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కలుసుకున్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
News October 7, 2024
పలాస: జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గౌతు శిరీష
వజ్రపు కొత్తూరు మండలం ఉద్దాన రామకృష్ణాపురంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ప్రారంభించారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతాయని అన్నారు. క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు వెంకన్న చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
News October 7, 2024
శ్రీకాకుళంలో ఈ నెల 9న చెస్ పోటీలు
శ్రీకాకుళంలో ఈనెల 9న జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు బి. కిషోర్ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అండర్ 15 విభాగంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.