News March 6, 2025

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలలో 815 మంది గైర్హాజర్

image

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలలో భాగంగా
గురువారం పరీక్షకు 815 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. జనరల్‌లో 21156 మంది, ఒకేషనల్‌లో 1342 మంది పరీక్షల్లో హాజరు కావలసి ఉందని వివరించారు. మొత్తంగా 22498 మందికి గాను 21683 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.

Similar News

News March 6, 2025

SKLM: పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం

image

పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం (పి-4) సర్వేకు కార్యాచరణ రూపొందించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను ఉపయోగించి ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ప్రారంభించి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.

News March 6, 2025

శ్రీకాకుళం: 18 షాపులు కేటాయింపు

image

పారదర్శకంగా లాటరీ పద్ధతిలో 18 బ్రాందీ షాపులు కేటాయించినట్లు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. గురువారం శ్రీకాకుళం అంబేడ్కర్ ఆడిటోరియంలో లాటరీ పద్ధతిలో గీత కార్మికులకు, సొండి కులస్థులు సమర్పించిన ధ్రువపత్రాల ప్రకారం ఆయా కేటగిరిలో కేటాయించామన్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

News March 6, 2025

ఆమదాలవలసలో భారీ లారీ బీభత్సం

image

ఆమదాలవలస మండలం తిమ్మాపురం గ్రామం దగ్గర బుధవారం లారీ బీభత్సం సృష్టించింది. పాలకొండ రోడ్డులో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉండే కిరాణా షాప్స్ మీదకి దూసుకెళ్లింది. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కిరాణా షాపుల ఫ్లెక్సీ బోర్డులు పూర్తిగా ధ్వంసమయ్యాయి . లారీ డ్రైవర్ మద్యం తాగి నడిపినట్లు షాపు యజమాని చెబుతున్నాడు.

error: Content is protected !!