News April 16, 2024
శ్రీకాకుళం: ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ

ఈనెల 18వ తేదీ నుంచి సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణకు రిటర్నింగ్ అధికారులందరూ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. మంగళవారం BZA నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్చువల్గా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల పై మీనా సమీక్షించారు.
Similar News
News April 23, 2025
SKLM: గ్రామదేవతల సిరిమాను ఉత్సవంపై సమీక్ష

అన్ని శాఖల సమన్వయంతో శ్రీ గ్రామదేవతల సిరిమాను ఉత్సవం ఏర్పాట్లపై దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు అన్నారు. బుధవారం కలెక్టరెట్ మందిరంలో గ్రామదేవతల సిరిమాను ఉత్సవం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమన్వయంతో విధులు నిర్వహించి పండగ ఒక మంచి వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
News April 23, 2025
శ్రీకాకుళంలో పదో తరగతి విద్యార్థి సూసైడ్

పదో తరగతి ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని శ్రీకాకుళానికి చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలగ ప్రాంతానికి చెందిన గురుగుబిల్లి వేణుగోపాలరావుకు బుధవారం విడుదలైన పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 393 మార్కులు వచ్చాయి. తక్కువ రావడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
News April 23, 2025
శ్రీకాకుళం : టెన్త్ రిజల్ట్స్.. 23,219 మంది పాస్

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 28,176 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,219 మంది పాసయ్యారు. 14,287 మంది బాలురు రాయగా 11,358 మంది పాసయ్యారు. 13,889 మంది బాలికలు పరీక్ష రాయగా 11,861 మంది పాసయ్యారు. 82.41 పాస్ పర్సంటేజ్ తో శ్రీకాకుళం జిల్లా 14వ స్థానంలో నిలిచింది. గతేడాది రెండో స్థానంలో నిలవగా.. 14వ స్థానానికి పడిపోయింది.