News June 23, 2024

శ్రీకాకుళం: ఏపీ పీఈసెట్-2024 హాల్ టికెట్లు విడుదల

image

డీపీఈడీ/బీపీఈడీ కోర్సులలో ప్రవేశాలకై నిర్వహించే పీఈసెట్-2024 ఫిజికల్ టెస్ట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పీఈసెట్ అభ్యర్థులకు ఈ నెల 25న ఉదయం 7 గంటల నుంచి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి(APSCHE) తెలిపింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని APSCHE సూచించింది.

Similar News

News October 6, 2024

‘బంగారువలస-వైజాగ్ బస్సును పునరుద్ధరించండి’

image

వంగర కేంద్రంలో బంగారువలస నుంచి వైజాగ్ వెళ్లే బస్సును పునరుద్దరించాలని ప్రయాణీకులు విజ్ఞప్తి చేశారు. గత 8 నెలలగా బంగారు వలస వైజాగ్ సర్వీస్‌లను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి బంగారువలస ద్వారా వంగర, రాజాం, విజయనగరం, మీదుగా ప్రయాణించే ఉద్యోగులు వ్యాపారస్తులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సును పునరుద్దరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News October 5, 2024

SKLM: ప్రజలకు మరింత చేరువగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ: ఎస్పీ

image

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలకు మరింత చేరువగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అదేవిధంగా ప్రతీ శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల ఫిర్యాదులు స్వీకరణ ఉంటుందని ప్రజలకు తెలిపారు.

News October 5, 2024

ఆమదాలవలస: ‘ఖరీఫ్‌‌కు ఈ–పంట, ఈ కేవైసీ తప్పనిసరి’

image

ఖరీప్‌కు ఈ-పంట నమోదు, ఈకేవైసీ కార్యక్రమాన్ని రైతులు విధిగా చేయించుకోవాలని, ఆరోగ్యవంతమైన, నాణ్యమైన పంటలను పండించే దిశగా వారిని వ్యవసాయ అధికారులు కూడా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఆమదాలవలస మండలంలోని తొటాడ గ్రామంలో శనివారం ఖరీఫ్ వరికి ఈ పంట నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సర్వే నంబర్లలోని వరి పంట పొలాలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.