News September 25, 2024
శ్రీకాకుళం ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

శ్రీకాకుళం జిల్లా పాతర్లపల్లి హైస్కూల్లో జరిగిన ఘటనపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘వైసీపీ హయాంలో నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన పాఠశాల భవనం సన్ షేడ్ కూలి విద్యార్థి కృష్ణంరాజు మృతి, మరో విద్యార్థి గాయపడటం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పాఠశాలల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటాం’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News March 13, 2025
మంత్రి అచ్చెన్నాయుడుపై కేసు కొట్టివేత

ఓబులాపురం మైనింగ్పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల నరేంద్ర, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు. గురువారం ఉదయం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకున్నారు.
News March 13, 2025
పాతపట్నం: వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే మృతి

పాతపట్నం నుంచి టెక్కలి వెళ్లే రహదారి మార్గంలోని ద్వారకాపురం గ్రామం వద్ద బుధవారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పాతపట్నం మండలం, లాబర గ్రామానికి చెందిన సనపల మధు(22) మృతి చెందాడు. మృతుడి బావ మండల శివకు గాయాలయ్యాయి. సారవకోట మండలం జమ్మి చక్రం గ్రామానికి చెందిన మరో వ్యక్తి పంతులు గోపి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడికి ఏప్రిల్ 16 న పెళ్లి నిశ్చయమైంది.
News March 13, 2025
శ్రీకాకుళం: నేడు ఈ మండలాలకు ఆరంజ్ అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలో గురువారం కింది మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ప్రజలు వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఈ మేరకు తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.*పోలాకి 37.6*నరసన్నపేట 37.8 *జి.సిగడం 40.6*ఎచ్చెర్ల 37.6* శ్రీకాకుళం 38*లావేరు 38.4 *పోలాకి 37.6*పొందూరు 39.6