News March 23, 2024

శ్రీకాకుళం: ఘోరం.. ఎలుగు దాడిలో ఇద్దరు మృతి

image

వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి, చీపురుపల్లి సమీపంలో ఘోర ఘటన జరిగింది. ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి చెందగా.. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. జీడి తోటలో పనులకు వెళ్లిన సీహెచ్.లోకనాథం, అప్పికొండ కుమార్ అనే రైతులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 6, 2024

దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక రైళ్లు

image

దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 7,8,9 తేదీల్లో CHE- BZA(నం.07216) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లు పై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.

News October 6, 2024

అంపైర్‌గా సిక్కోలు వాసి

image

విజయవాడలో ఆలిండియా జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ పోటీలు ఈనెల 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీలకు అంపైర్‌గా ఉద్దానం ప్రాంతానికి చెందిన తుంగాన శరత్‌కు అవకాశం వచ్చింది. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి శరత్‌కు ఉత్తర్వులు అందాయి. ఆయనను పలువురు అభినందించారు.

News October 6, 2024

SKLM: నేటి నుంచి IIITకి సెలవులు

image

ఎచ్చెర్లలోని IIIT క్యాంపస్‌కు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చినట్లు డైరెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సోమవారం తరగతులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.