News August 9, 2024
శ్రీకాకుళం: జిల్లా BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా BSNL 4జీ దశలవారీగా ప్రవేశ పెడుతున్నట్లు వినియోగదారులు 2జీ, 3జీ సిమ్ కార్డులను తక్షణమే 4జీకి అప్గ్రేడ్ చేసుకోవాలని BSNL శ్రీకాకుళం జిల్లా జనరల్ మేనేజర్ నాయుడు మర్రి గురువారం తెలిపారు. జిల్లాలో 229 టవర్లకు ఇప్పటికే 50 టవర్లను 4జీ టవర్లుగా మార్పు చేశామని తెలిపారు. కస్టమర్లు కేవైసీని దగ్గర్లో ఉన్న BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఉచితంగా అప్గ్రేడ్ చూసుకోవచ్చున్నారు.
Similar News
News March 11, 2025
శ్రీకాకుళంలో నిండు గర్భిణి మృతి..ప్రమాదం ఎలా జరిగిందంటే

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ నిండు గర్భిణి మృతి చెందిన ఘటన శ్రీకాకుళంలో జరిగిన విషయం తెలిసిందే. ఎచ్చెర్ల (M) కుంచాలకూర్మయ్యపేటకు చెందిన దుర్గరావు భార్య రాజేశ్వరి నిండు గర్భిణి. సోమవారం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఇంటికి బైక్పై వెళ్తుండగా డే అండ్ నైట్ కొత్త జంక్షన్ వద్ద వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. భర్తపై బైక్ పడిపోగా, ఆమె తొడ భాగంపై నుంచి బస్సు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.
News March 11, 2025
ఎచెర్ల: స్పెషల్ డ్రైవ్ పరీక్షఫలితాలు విడుదల

ఎచ్చెర్ల మండలంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల ఇయర్ ఎండింగ్ స్పెషల్ డ్రైవ్ పరీక్ష ఫలితాలను సోమవారం రాత్రి యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పరీక్ష ఫలితాలు https://www.vidyavision.com/results/DRBRAUUG1st2nd3rdsemResults వెబ్సైట్ సందర్శించాలని తెలిపారు.
News March 11, 2025
శ్రీకాకుళం: జీరో పావర్టీ పీ-4 విధానం ప్రారంభం- కలెక్టర్

స్వర్ణాంధ్ర @ 2047 కార్యాచరణలో భాగంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన జీరో పావర్టీ-పీ4 విధానం ప్రక్రియ జిల్లాలో మొదలైందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్ (పీ4) విధానానికి ఉగాది నుంచి ప్రారంభం కానుందని కలెక్టర్ తెలిపారు.