News April 15, 2025

శ్రీకాకుళం: జిల్లాలో 857 చలివేంద్రాలు ఏర్పాటు

image

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు జిల్లాలో 857 చలివేంద్రాలు మంగళవారం ఏర్పాటు చేశారు. జిల్లాలోని 912 గ్రామ పంచాయతీల్లో ఈ చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సర్వే ప్రకారం ఈ చలివేంద్రాలలో 137 ప్రభుత్వ శాఖల ద్వారా, 693 స్థానిక సంస్థల ద్వారా, 27 స్వచ్చంద సంస్థల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి మానిటరింగ్ అధికారిని నియమించి పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News April 20, 2025

ఇచ్ఛాపురంలో నేడు  కేంద్రమంత్రి పర్యటన

image

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నేడు(ఆదివారం) కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. సోంపేట మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించనన్నారు. కంచిలి మండలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఇచ్ఛాపురం మండలంలో బెల్లుపడలో జరుగుతున్న యజ్ఞంలో పాల్గొని, అనంతరం ప్రజలు నుండి వినతులు స్వీకరిస్తారు.

News April 19, 2025

పైడిభీమవరంలో మహిళ దారుణ హత్య

image

రణస్థలం మండలం పరిధిలో పైడిభీమవరం పంచాయతీ గొల్లపేటకు చెందిన భవాని(26)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతురాలు పైడిభీమవరంలోని ఓ హోటల్‌లో పని చేస్తుంది. శనివారం సాయంత్రం హోటల్ నుంచి ఇంటికి వస్తుండగా చిన్న చాక్‌తో దుండగులు దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.

News April 19, 2025

కూటమి వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్ష : ధర్మాన

image

రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్షగా నిలుస్తాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. శనివారం తాడేపల్లి కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. లేనిపోని హామీలను గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. గడిచి పది నెలలు పూర్తైనా నెరవేర్చలేకపోయారని విమర్శించారు.

error: Content is protected !!