News April 18, 2024

శ్రీకాకుళం జిల్లాలో తొలిరోజు నామినేషన్లు వేసింది వీరే..

image

శ్రీకాకుళం జిల్లాలో తొలి రోజు నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇచ్ఛాపురం స్వతంత్ర అభ్యర్థిగా జె.సూర్య వరప్రసాదరావు, టెక్కలి స్వతంత్ర అభ్యర్థిగా రాజేష్, ఆమదాలవలస స్వతంత్ర అభ్యర్థులుగా జగదీశ్వరరావు, వెంకట రాజశేఖర్, ఎచ్చెర్ల స్వతంత్ర అభ్యర్థులుగా నేతల ఈశ్వరరావు, నడుపూరు ఈశ్వరరావు నామినేషన్లు వేశారు. కాగా.. ప్రధాన పార్టీల నుంచి ఏ ఒక్కరూ తొలిరోజు నామినేషన్ దాఖలు చెయ్యలేదు.

Similar News

News December 29, 2025

శ్రీకాకుళం: ముక్కోటి ఏకాదశి.. ముస్తాబైన వైష్ణవ ఆలయాలు

image

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగరంలోని వైష్ణవాలయాలు ఆధ్యాత్మిక శోభతో ముస్తాబయ్యాయి. అరసవిల్లి, శ్రీకూర్మం, నారాయణ తిరుమల ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశారు.

News December 29, 2025

శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 57 అర్జీలు

image

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా పిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు విన్నారు. మొత్తం 57 అర్జీలు స్వీకరించామన్నారు.

News December 29, 2025

శ్రీకాకుళం: ముక్కోటి ఏకాదశి.. ముస్తాబైన వైష్ణవ ఆలయాలు

image

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగరంలోని వైష్ణవాలయాలు ఆధ్యాత్మిక శోభతో ముస్తాబయ్యాయి. అరసవిల్లి, శ్రీకూర్మం, నారాయణ తిరుమల ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశారు.