News March 16, 2025

శ్రీకాకుళం: నేడు 11 మండలాలకు రెడ్ అలర్ట్: APSDMA

image

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం 11 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వడగాడ్పులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా రెడ్ అలర్ట్ జారీ చేసింది. జి.సిగడం 41.3, ఆమదాలవలస 40.6, బూర్జ 41.6, హిరమండలం 41.6, జలుమూరు 40.6, కొత్తూరు 41.6, ఎల్.ఎన్.పేట 41.5, పాతపట్నం 41.3, సారవకోట 40.8, సరుబుజ్జిలి 41.2, పొందూరు 40.3 

Similar News

News March 16, 2025

శ్రీకాకుళంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ దారి జడ్జి బంగ్లా ఎదురుగా గల మురికి కాలువలో ఓ గుర్తుతెలియని వ్యక్తి (45) పడిపోయి ఉండగా స్థానికులు ఈ నెల 13న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడని శ్రీకాకుళం టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిస్తే 63099 90824 నంబర్‌ను సంప్రదించాలని సీఐ సూచించారు.

News March 16, 2025

ఇచ్ఛాపురం: కరెంటు స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి

image

ఇచ్ఛాపురం మండలం కొలిగాం గ్రామ సమీప మలుపు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్‌కు చెందిన రాజేశ్ ఓ ఇటుకుల కంపెనీలో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని మరో వ్యక్తితో బైక్‌పై అతివేగంగా వస్తూ.. కరెంటు స్తంభాన్ని ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు.

News March 16, 2025

కలకత్తా నుంచి కన్యాకుమారికి సైకిల్ ర్యాలీ

image

సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు 6,500 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం గుండా సైకిల్ ర్యాలీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ ర్యాలీ శనివారం రాత్రి ఆంధ్ర రాష్ట్రంలోకి విచ్చేసిన సందర్భంగా కంచిలిలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. భారతమాతాకి జై అంటూ వారు నినాదాలు చేశారు. ఈ ర్యాలీ పాల్గొన్న 60 మందిని సత్కరించారు.

error: Content is protected !!