News September 27, 2024

శ్రీకాకుళం: ‘ముద్దాయిలకు ఉచిత న్యాయ సేవలు’

image

శ్రీకాకుళం కారగరంలో ముద్దాయిలకు న్యాయ అవగాహన సదస్సును గురువారం నిర్వహించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జైలు ముద్దాయిలకు ఉచిత న్యాయసేవలు అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ముద్దాయిలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేసులు విషయంలో రాజీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని అవగాహన కల్పించారు. రాజియే రాజమార్గం అన్నారు. సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News October 11, 2024

దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురిపై కేసు నమోదు

image

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురిపై గురువారం తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల తిరుమల క్షేత్రాన్ని దర్శించిన వీరు తిరుమల మాడ వీధుల్లో అభ్యంతరకరంగా వ్యవహరించారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ అధికారులు ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

News October 10, 2024

తెలంగాణ DSCలో కొర్లకోట యువతి సత్తా

image

ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన పేడాడ హిమ శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ పరీక్షలలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ ఫలితాలకు సంబంధించి రాష్ట్రంలో 9వ ర్యాంక్ సాధించింది. ఈమె తండ్రి ప్రభాకరరావు స్కూల్ అసిస్టెంట్‌గా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. తల్లి గృహిణి. హేమ శ్రీ ఎంపిక పట్ల తల్లిదండ్రులు గ్రామస్థులు అభినందనలు తెలిపాలి.

News October 10, 2024

శ్రీకాకుళం: భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

image

భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తహసీల్దార్లకు ఆదేశించారు. తహసీల్దార్లుతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ అర్జీలపై గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ఎలినేషన్స్ పైన మండలాల వారీగా ఆయన సమీక్షించారు. ఎలినేషన్స్ ప్రతిపాదనలు తక్షణమే పంపాలని ఆదేశించారు. కోర్టు కేసులు ఎక్కడెక్కడ పెండింగ్‌లో ఉన్నది తెలుసుకోవాలని చెప్పారు.