News June 15, 2024

శ్రీకాకుళం: స్పెషల్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో జరిగిన MSC 2వ సెమిస్టర్ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఫిజిక్స్, గణితం, స్టాటిస్టిక్స్, హ్యూమన్ జెనెటిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, జియో ఫిజిక్స్ తదితర కోర్సులకు నిర్వహించిన స్పెషల్ పరీక్షల నేడు ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలకై విద్యార్థులు యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చూడవచ్చు.

Similar News

News October 2, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సిద్ధం: కేంద్ర మంత్రి

image

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం పాతపట్నంలో పీఎం జన్మాన్ వసతిగృహ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తిచేస్తామన్నారు.

News October 2, 2024

సికింద్రాబాద్- శ్రీకాకుళానికి ప్రత్యేక రైలు

image

దసరా సందర్భంగా సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 07487 నంబర్ గల ట్రైన్ సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు మధ్య ఆరు ట్రిప్పులు తిరుగుతుందని తెలిపారు. ఈ రైలు అక్టోబర్ 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం నడపనున్నారు. ఈ మేరకు ప్రయాణికులు విషయాన్ని గమనించాలని అన్నవరం, విజయనగరం మధ్య రాకపోకలు సాగిస్తుందని రైల్వే అధికారులు సూచించారు.

News October 2, 2024

స్వచ్ఛ శ్రీకాకుళం లక్ష్యం : రామ్మోహన్ నాయుడు

image

స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యంగా ముందుకు సాగాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం నగరంలో సైకిల్ తొక్కుతూ అవగాహన కల్పించారు.