News June 23, 2024
శ్రీకాకుళంలో భార్యా పిల్లల అదృశ్యం
ఇచ్చాపురం మండలం డొంకూరు గ్రామంలో భార్య పిల్లలు కనిపించడం లేదంటూ భర్త చంద్రయ్య ఇచ్చాపురం ఎస్ఐ లక్ష్మణరావుకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వివరాలు.. తొమ్మిదేళ్ల కిందట బాధితుడికి రాములమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈనెల 13న భర్త చేపలవేటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య, పిల్లలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల, తెలిసినచోట్ల వెతికినా ఆచూకి లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News October 6, 2024
‘బంగారువలస-వైజాగ్ బస్సును పునరుద్ధరించండి’
వంగర కేంద్రంలో బంగారువలస నుంచి వైజాగ్ వెళ్లే బస్సును పునరుద్దరించాలని ప్రయాణీకులు విజ్ఞప్తి చేశారు. గత 8 నెలలగా బంగారు వలస వైజాగ్ సర్వీస్లను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి బంగారువలస ద్వారా వంగర, రాజాం, విజయనగరం, మీదుగా ప్రయాణించే ఉద్యోగులు వ్యాపారస్తులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సును పునరుద్దరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News October 5, 2024
SKLM: ప్రజలకు మరింత చేరువగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ: ఎస్పీ
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలకు మరింత చేరువగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అదేవిధంగా ప్రతీ శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల ఫిర్యాదులు స్వీకరణ ఉంటుందని ప్రజలకు తెలిపారు.
News October 5, 2024
ఆమదాలవలస: ‘ఖరీఫ్కు ఈ–పంట, ఈ కేవైసీ తప్పనిసరి’
ఖరీప్కు ఈ-పంట నమోదు, ఈకేవైసీ కార్యక్రమాన్ని రైతులు విధిగా చేయించుకోవాలని, ఆరోగ్యవంతమైన, నాణ్యమైన పంటలను పండించే దిశగా వారిని వ్యవసాయ అధికారులు కూడా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఆమదాలవలస మండలంలోని తొటాడ గ్రామంలో శనివారం ఖరీఫ్ వరికి ఈ పంట నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సర్వే నంబర్లలోని వరి పంట పొలాలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.